కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోములలోని రామిరెడ్డి అనే వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక సహకార బ్యాంకులో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఆయనకు...చిన్న వయసులోనే పోలియో సోకింది. దీనివల్ల రెండు కాళ్లు నడవడానికి సహకరించలేదు. ఒంటరి జీవితాన్ని గడపలేక...ఇతరుల సాయం పొందలేక ఆవేదన చెందాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడిన రామిరెడ్డికి... జీవితంపై విరక్తి చెంది మంగళవారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఇందులో ఓ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఈ ఘటనపై సంజామల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య