ETV Bharat / state

బనగానపల్లెకు కేంద్ర బృందం.. కరోనా నివారణపై దృష్టి

బనగానపల్లెలో కరోనా వైరస్ వ్యాప్తి పరిశీలక​ కేంద్ర బృందం పర్యటించింది. అధికారులతో సమావేశమైంది. అనంతరం.. కొవిడ్​ బారినపడి నయమైన రోగుల వివరాలను బృంద సభ్యులు తెలుసుకున్నారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో పర్యటించారు.

author img

By

Published : May 20, 2020, 7:47 AM IST

corona virus special team from central visits kurnool district
బనగానపల్లెలో పర్యటించిన కొవిడ్​ కేంద్ర బృందం

కర్నూలు జిల్లా బనగానపల్లెలో కరోనా వైరస్ కేంద్ర బృందం సభ్యులు మధుమిత దుబే, సంజయ్ కుమార్, సాధుఖాన్​లు పర్యటించారు. బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. లాక్‌డౌన్‌ అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై మాట్లాడారు.

కరోనా నుంచి కోలుకున్న కుటుంబాల వివరాల తెలుసుకున్నారు. అనంతరం రెడ్​జోన్ ప్రాంతాల్లో పర్యటించి... ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి వైరస్ నివారణకు చేయూత ఇవ్వాలని కోరారు. అనంతరం యాగంటి బయలుదేరి వెళ్లారు.

కర్నూలు జిల్లా బనగానపల్లెలో కరోనా వైరస్ కేంద్ర బృందం సభ్యులు మధుమిత దుబే, సంజయ్ కుమార్, సాధుఖాన్​లు పర్యటించారు. బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. లాక్‌డౌన్‌ అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై మాట్లాడారు.

కరోనా నుంచి కోలుకున్న కుటుంబాల వివరాల తెలుసుకున్నారు. అనంతరం రెడ్​జోన్ ప్రాంతాల్లో పర్యటించి... ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి వైరస్ నివారణకు చేయూత ఇవ్వాలని కోరారు. అనంతరం యాగంటి బయలుదేరి వెళ్లారు.

ఇదీ చదవండి:

విదేశాల నుంచి విశాఖ రానున్న 4 విమానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.