ETV Bharat / state

తుపాకీతో బెదిరించారు.. చివరికి జైలు పాలయ్యారు

కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్కు సిబ్బందిపై తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన నలుగురు వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. పార్కు సిబ్బంది ఫిర్యాదు మేరకు ఈ నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

author img

By

Published : Jul 5, 2019, 4:39 PM IST

తుపాకీతో బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు
తుపాకీతో బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు

కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్కు సిబ్బందిని తుపాకీతో బెదిరించిన కేసులో నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదైంది. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివానందరెడ్డి, లోక్​నాథ్ రెడ్డి, మంచాలకట్ట గ్రామానికి చెందిన మేఘనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి.. గురువారం సోలార్ పార్కులోకి వెళ్లారు. తమకు కాంట్రాక్టు పనులు ఇవ్వాలని బెదిరించారని సిబ్బంది ఆరోపించారు.

స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉద్యోగులను తుపాకీతో బెదిరించడంపై... సిబ్బంది గడివేముల పోలీసులను ఆశ్రయించారు. నంజుండప్ప అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురిపై సెక్షన్ 447, 506, 384 రెడ్ విత్ 511 మారణాయుధాల చట్టంలోని సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిందితుల నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి : కాంట్రాక్టు ఇవ్వాల్సిందే... తుపాకీతో వైకాపా నేత బెదిరింపు!

తుపాకీతో బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు

కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్కు సిబ్బందిని తుపాకీతో బెదిరించిన కేసులో నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదైంది. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివానందరెడ్డి, లోక్​నాథ్ రెడ్డి, మంచాలకట్ట గ్రామానికి చెందిన మేఘనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి.. గురువారం సోలార్ పార్కులోకి వెళ్లారు. తమకు కాంట్రాక్టు పనులు ఇవ్వాలని బెదిరించారని సిబ్బంది ఆరోపించారు.

స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉద్యోగులను తుపాకీతో బెదిరించడంపై... సిబ్బంది గడివేముల పోలీసులను ఆశ్రయించారు. నంజుండప్ప అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురిపై సెక్షన్ 447, 506, 384 రెడ్ విత్ 511 మారణాయుధాల చట్టంలోని సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిందితుల నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి : కాంట్రాక్టు ఇవ్వాల్సిందే... తుపాకీతో వైకాపా నేత బెదిరింపు!

Intro:యాంకర్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 122వ జయంతి విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవి పేట అల్లూరి స్మారక మందిరం నిర్వహించారు ఈ సందర్భంగా నర్సీపట్నం డివిజనల్ అధికారి గోవిందరావు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంతకుముందు అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ లక్ష్మీపురం వద్ద ర్యాలీగా బయలుదేరి కృష్ణదేవిపేట చేరుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానంగా విద్యాభ్యాసం చేసే విద్యార్థులు విజ్ఞానం అనే మూడు పొందాలంటే చదువు అనే జ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అంతకుముందు మందిరంలో మొక్కలను నాటారు


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.