విద్యార్థులు విభిన్నమైన ఆలోచనలతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించవచ్చని జనసేన నేత, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలు నగరంలో జరిగిన ఇంపాక్ట్-2019 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. చంద్రయాన్-2 ప్రయోగ ముఖ్య లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. చంద్రమండలంలో ఉన్న హీలియంతో ఎలాంటి కాలుష్యం లేకుండా... 10 వేల సంవత్సరాల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చని చెప్పారు. సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చేందుకు చంద్రయాన్ - 2 పరిశోధన ఉపయోగపడుతుందని లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి...