కర్నూలు సమీపంలోని పెద్దటేకూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్కు చెందిన రవీంద్రబాబు తన ద్విచక్రవాహనంపై డోన్ వైపు వెళ్తుండగా.. పెద్దటేకూర్ బ్రిడ్జి వద్ద వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీంద్రబాబు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి : వందే భారత్ మిషన్: మస్కట్ నుంచి విజయవాడకు భారతీయులు