యురేనియం తవ్వకాలకు అనుమతివ్వడం సరికాదన్న అఖిలప్రియ కర్నూలు జిల్లాలో.. యురేనియం అన్వేషణ, తవ్వకాలకు కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం బాధాకరమని మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ అన్నారు. కర్నూలులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆమె.. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ రుద్రవరం, ఆత్మకూరు మండలాల పరిధిలో యురేనియం అన్వేషణకు సహకరించాలని.. తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం తవ్వకాలతో ప్రజలకు జరిగిన నష్టాన్ని చూసి కూడా... కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకానికి అనుమతులు ఇవ్వడం సబబు కాదన్నారు. ముఖ్యమంత్రి తీరు చూస్తే ఆయన సొంత జిల్లాలో జరిగిన నష్టాన్ని కర్నూలు జిల్లాలో కూడా జరగాలని భావిస్తున్నట్లుగా ఉందన్నారు. యురేనియం తవ్వకాలు జరిగితే పార్టీలకతీతంగా నేతలు పోరాడాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: