ETV Bharat / state

మద్యం మత్తులో స్నేహితుడి హత్య..!

కర్నూలులో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ హత్యకు దారి తీసింది. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

author img

By

Published : May 13, 2021, 11:52 PM IST

murder at kurnool
మద్యం మత్తులో స్నేహితుడి హత్య

మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి హత్యకు దారితీసిన ఘటన కర్నూలులో చోటుచేసుంది. శరీన్ నగర్ కు చెందిన గిడ్డయ్య, మహేంద్ర మద్యం తాగేందుకు మూడు రోజుల క్రితం నగర సమీపంలోని టిడ్కో గృహ సముదాయం వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరు గొడవ పడ్డారు. గిడ్డయ్య కత్తితో మహేంద్రను హత్య చేశాడు. ఇవాళ గిడ్డయ్య పోలీసులకు వద్దకు వెళ్లి తనపై మహేంద్ర కత్తితో దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. గిడ్డయ్యే మహేంద్రను హత్య చేసినట్లు తెలిసింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది.

ఇవీ చదవండి:

మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి హత్యకు దారితీసిన ఘటన కర్నూలులో చోటుచేసుంది. శరీన్ నగర్ కు చెందిన గిడ్డయ్య, మహేంద్ర మద్యం తాగేందుకు మూడు రోజుల క్రితం నగర సమీపంలోని టిడ్కో గృహ సముదాయం వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరు గొడవ పడ్డారు. గిడ్డయ్య కత్తితో మహేంద్రను హత్య చేశాడు. ఇవాళ గిడ్డయ్య పోలీసులకు వద్దకు వెళ్లి తనపై మహేంద్ర కత్తితో దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. గిడ్డయ్యే మహేంద్రను హత్య చేసినట్లు తెలిసింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ఆ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్​ రోగులు మృతి

'ఈ నెల 17 నుంచి.. విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.