కోడెల శివ ప్రసాద్ రావు వైద్యరంగం, రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజల మన్ననలు పొందారని... కోడెల మరణం వ్యక్తిగతంగా తన మనసును కలిచివేసిందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభుతి తెలిపారు. కోడెల మృతి పట్ల జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు అనిల్ తెలిపారు.
ఇదీ చూడండి: కోడెల మృతి బాధాకరం: నామ నాగేశ్వరరావు