కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటలో మద్యం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. పేటలోని అడ్డరోడ్డు వద్ద ఉన్న మద్యం షాపు వద్ద మాస్కులు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహించారు. కరోనా వ్యాప్తిపై అంతా ఆందోళన చెందుతుంటే మద్యం ప్రియులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మద్యం షాపుల ముందు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..