ETV Bharat / state

నిర్మించారు....నిరుపయోగంగా వదిలేశారు!

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మండపాలు, షెడ్లు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. వీటిని భక్తులకు చేరువ చేయడంలో పాలకవర్గం విఫలమైంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి... వినియోగంలోకి తెస్తే ఆలయానికి ఆదాయంతోపాటు, భక్తులకు వసతి సదుపాయం కలుగుతుంది.

author img

By

Published : May 5, 2021, 2:16 PM IST

Unused Pavilions, sheds in Penuganchiprolu
Unused Pavilions, sheds in Penuganchiprolu

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మండపాలు, షెడ్లు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు దృష్టి సారించి వాటిని వినియోగంలోకి తీసుకువస్తే ఆలయానికి ఆదాయంతో పాటు, భక్తులకు వసతి సదుపాయం కలుగుతుంది.

ఏడెకరాల్లో..

తిరుపతమ్మ దేవస్థానానికి మున్నేరు పక్కనే విలువైన ఏడు ఎకరాల మామిడి తోట ఉంది. గతంలో నిరుపయోగంగా ఉండేది. ఐదెకరాల్లో 2007లో మామిడి మొక్కలు నాటించారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి ఫలసాయాన్ని ఇస్తున్నాయి. 2019లో రూ .10 లక్షల వ్యయంతో భక్తుల వసతి కోసం షెడ్ నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకురాకుండానే వదిలేశారు. దానికి ఎదురుగా ఉన్న మరో రెండు ఎకరాల భూమిలో 2011లో రూ. 10 లక్షల వ్యయంతో ఆడిటోరియం నిర్మించి విడిచిపెట్టారు. అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి ఆ రెండు నిర్మాణాలు చేపట్టిన అప్పటి పాలకవర్గాలు... వాటిని భక్తులకు చేరువ చేయడంలో విఫలం చెందాయి. అదే తోటల పక్కన ఉన్న ప్రైవేటు గార్డెన్లలో సాధారణ మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు అద్దెకు ఇస్తున్నారు.

గడచిన నాలుగైదేళ్లలో ప్రైవేటు గార్డెన్ల నిర్వాహకులు కొందరు ఏసీ మండపాలు ఇతర మేలైన సౌకర్యాలు కల్పిస్తూ... భక్తులను ఆకర్షించి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. దేవస్థానం మాత్రం ఒక్క రూపాయి ఆదాయాన్ని కూడా ఆర్జించలేక పోతుంది. కనీస వసతులు కల్పించి ప్రైవేటు గుత్తేదారులకు అప్పగించినా రూ. లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. లేదంటే దేవస్థానమే సౌకర్యాలు కల్పించి తక్కువ ధరలో భక్తులకు అద్దెకు ఇచ్చినా ఆదాయం వస్తుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేవాలయ ఆదాయం 40 శాతం పడిపోయింది. ఇలాంటి సమయంలో అదనపు ఆదాయాన్ని ఇచ్చే గార్డెన్ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

తిరుమల భక్తుల సంగతేమిటో..!

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మండపాలు, షెడ్లు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు దృష్టి సారించి వాటిని వినియోగంలోకి తీసుకువస్తే ఆలయానికి ఆదాయంతో పాటు, భక్తులకు వసతి సదుపాయం కలుగుతుంది.

ఏడెకరాల్లో..

తిరుపతమ్మ దేవస్థానానికి మున్నేరు పక్కనే విలువైన ఏడు ఎకరాల మామిడి తోట ఉంది. గతంలో నిరుపయోగంగా ఉండేది. ఐదెకరాల్లో 2007లో మామిడి మొక్కలు నాటించారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి ఫలసాయాన్ని ఇస్తున్నాయి. 2019లో రూ .10 లక్షల వ్యయంతో భక్తుల వసతి కోసం షెడ్ నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకురాకుండానే వదిలేశారు. దానికి ఎదురుగా ఉన్న మరో రెండు ఎకరాల భూమిలో 2011లో రూ. 10 లక్షల వ్యయంతో ఆడిటోరియం నిర్మించి విడిచిపెట్టారు. అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి ఆ రెండు నిర్మాణాలు చేపట్టిన అప్పటి పాలకవర్గాలు... వాటిని భక్తులకు చేరువ చేయడంలో విఫలం చెందాయి. అదే తోటల పక్కన ఉన్న ప్రైవేటు గార్డెన్లలో సాధారణ మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు అద్దెకు ఇస్తున్నారు.

గడచిన నాలుగైదేళ్లలో ప్రైవేటు గార్డెన్ల నిర్వాహకులు కొందరు ఏసీ మండపాలు ఇతర మేలైన సౌకర్యాలు కల్పిస్తూ... భక్తులను ఆకర్షించి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. దేవస్థానం మాత్రం ఒక్క రూపాయి ఆదాయాన్ని కూడా ఆర్జించలేక పోతుంది. కనీస వసతులు కల్పించి ప్రైవేటు గుత్తేదారులకు అప్పగించినా రూ. లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. లేదంటే దేవస్థానమే సౌకర్యాలు కల్పించి తక్కువ ధరలో భక్తులకు అద్దెకు ఇచ్చినా ఆదాయం వస్తుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేవాలయ ఆదాయం 40 శాతం పడిపోయింది. ఇలాంటి సమయంలో అదనపు ఆదాయాన్ని ఇచ్చే గార్డెన్ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

తిరుమల భక్తుల సంగతేమిటో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.