ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొని కేక్ కట్ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంజద్ భాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలు కేకు కోసి తమ ఆనందం వ్యక్తం చేశారు.
సాలూరులో కేక్ కట్ చేసి సంబరాలు
విజయనగరం జిల్లా సాలూరు మెయిన్ రోడ్డు బోసుబొమ్మ జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి 3 వేల 600 కిలోమీటర్ల పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని కొనియాడారు.
ఇవీ చదవండి: