ETV Bharat / state

ట్రాక్టర్​ బోల్తాపడి... ఒకరు మృతి

కృష్ణా జిల్లా మైలవరంలో ట్రాక్టర్ బోల్తా పడింది. మైలవరం మండలం తోలుకోడు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : May 11, 2019, 11:03 AM IST

trator boltaha one die

కృష్ణా జిల్లా మైలవరంలో ట్రాక్టర్ బోల్తా పడింది. మైలవరం మండలం తోలుకోడు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెడ్డిగుడెం ఓబులాపురం నుంచి తోలుకోడు మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గెదెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. మృతుడు ఓబులాపురానికి చెందిన తిరుమలరావుగా గుర్తించారు. మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్​ బోల్తాపడి... ఒకరు మృతి

కృష్ణా జిల్లా మైలవరంలో ట్రాక్టర్ బోల్తా పడింది. మైలవరం మండలం తోలుకోడు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెడ్డిగుడెం ఓబులాపురం నుంచి తోలుకోడు మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గెదెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. మృతుడు ఓబులాపురానికి చెందిన తిరుమలరావుగా గుర్తించారు. మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్​ బోల్తాపడి... ఒకరు మృతి
Intro:ap_cdp_16_11_mothers_day_special_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
మామూలుగా ఉండే పిల్లలను ఇద్దరిని పోషించాలంటే వారి ఆలనా పాలనా చూడాలంటే ప్రస్తుత రోజుల కష్టం.. అలాంటిది పదిమంది అనాధలు, అందులోనూ మానసిక వికలాంగులు.. వారందరినీ నీ సొంత బిడ్డలవలె అక్కున చేర్చుకుని వారి ఆలనాపాలనా చూస్తూ ఆ పది మంది తమ పిల్లలను సొంత పిల్లల వలె చూసుకుంటుంది ఆ తల్లి.. అన్నం తిన లేని వారికి కూడా అన్నం తినిపిస్తూ వారిని కన్నబిడ్డల వలె ఆదరిస్తుంది.. అయితే.. ఎవరా.. మహాతల్లి మీరే చూడండి... తల్లుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
వాయిస్ ఓవర్:1
కడప ఎర్రముక్కపల్లె కు చెందిన పద్మావతి దేవి కి పుట్టుకతోనే మానసిక వికలాంగ కొడుకు పుట్టాడు. అతని వయస్సు ఇప్పుడు 30 సంవత్సరాలు, 30 ఏళ్ల నుంచి మానసిక వికలాంగుడైన కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఇదిలా ఉండగా పదిహేనేళ్ల క్రితం ఆమెకు ఓ ఆలోచన తట్టింది. తన బిడ్డ వలె అక్కడక్కడ మానసిక వికలాంగులు ఉంటారు. వారిని కూడా అక్కున చేర్చుకుని తన బిడ్డ కు అందిస్తున్న సేవలు అందించాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే మానసిక వికలాంగులను ఎలా చూసుకోవాలో ఈమెకు 30 ఏళ్ల నుంచి తెలుసు. ఈ మేరకు 2004లో పద్మావతి మానసిక వికలాంగుల కేంద్రాన్ని ప్రారంభించారు. తన బిడ్డతో పాటు మిగిలిన పది మంది మానసిక వికలాంగులను సొంత బిడ్డలా చూసుకుంటుంది. మానసిక వికలాంగుల అంటే చెప్పనక్కర్లేదు కనీసం ఆకలి అవుతుంది అని కూడా చెప్పలేని దుస్థితిలో ఉంటారు. ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు వారికి అన్ని రకాల సేవలను అందిస్తుంది. వీరిలో చాలామంది కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితి లో ఉన్నారు. వారందరినీ దగ్గరకు చేర్చుకుని అన్నం తినిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె సేవలను వెలకట్టలేము. మామూలుగా ఉండే పిల్లలను ను చూసుకోవాలంటే గగనంగా ఉంటుంది. అలాంటిది 10 మంది మానసిక వికలాంగులను చూసుకోవడం అంటే గొప్ప విషయం. వీరిలో చాలా మందికి తల్లిదండ్రులు లేరు వారి మలమూత్రాలు సైతం ఈ తల్లి ఎత్తివేసింది. వీరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేదు. పద్మావతి దేవి చేస్తున్న సేవలను చూసి తమ వంతు సేవలు అందించాలని ఇక్కడికి వచ్చి ఉచితంగా సేవ చేస్తున్నాం అని శివ పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా నా మానసిక వికలాంగులు ఉంటే అక్కున చేర్చుకుంటాం అని పద్మావతి దేవి చెప్పారు.
byte: శివ, కడప.
byte: పద్మావతి దేవి, మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకురాలు, కడప.


Body:మదర్స్ డే ప్రత్యేక కథనం


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.