ETV Bharat / state

టూరిజం ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం..పాల్గొన్న మంత్రులు

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హోటళ్లకు ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు.

author img

By

Published : Sep 28, 2019, 8:41 PM IST

Updated : Sep 28, 2019, 10:47 PM IST

తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా...పలు హోటళ్లకు టూరిజం అవార్డులు
తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా...పలు హోటళ్లకు టూరిజం అవార్డులు

కృష్ణా జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హోటళ్లకు టూరిజం ఎక్స్​లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. కేరళ రాష్ట్ర జీడీపీలో 11 శాతం పర్యటకానేదే అని మంత్రి అవంతి అన్నారు. రాష్ట్రంలోనూ పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్న ఆయన...పర్యటకుల కోసం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను తీసుకొస్తామని తెలిపారు.

ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్న హోటళ్లు

* ఉత్తమ 5 స్టార్ హోటల్‌- విశాఖ నోవాటెల్‌
* ఉత్తమ 5 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- విజయవాడ గేట్ వే
* ఉత్తమ 4 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- విశాఖ పామ్‌బీచ్ హోటల్‌
* ఉత్తమ 3 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- హోటల్ బ్లీస్‌
* ఉత్తమ పర్యావరణహిత హోటల్‌- పల్లవి రిసార్ట్స్, పాలకొల్లు

ఇదీ చూడండి: కొక్కిలిగడ్డ ప్రభుత్వ బడి... ఎదుగుతోంది ప్రైవేటుతో పోటీ పడి...

తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా...పలు హోటళ్లకు టూరిజం అవార్డులు

కృష్ణా జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హోటళ్లకు టూరిజం ఎక్స్​లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. కేరళ రాష్ట్ర జీడీపీలో 11 శాతం పర్యటకానేదే అని మంత్రి అవంతి అన్నారు. రాష్ట్రంలోనూ పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్న ఆయన...పర్యటకుల కోసం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను తీసుకొస్తామని తెలిపారు.

ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్న హోటళ్లు

* ఉత్తమ 5 స్టార్ హోటల్‌- విశాఖ నోవాటెల్‌
* ఉత్తమ 5 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- విజయవాడ గేట్ వే
* ఉత్తమ 4 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- విశాఖ పామ్‌బీచ్ హోటల్‌
* ఉత్తమ 3 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- హోటల్ బ్లీస్‌
* ఉత్తమ పర్యావరణహిత హోటల్‌- పల్లవి రిసార్ట్స్, పాలకొల్లు

ఇదీ చూడండి: కొక్కిలిగడ్డ ప్రభుత్వ బడి... ఎదుగుతోంది ప్రైవేటుతో పోటీ పడి...

Intro:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నీట మునిగిన పంటలు


Body:ఓ పక్క అధిక వర్షాభావం మరో వైపు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రైతన్నలను నిండా ముంచేశాయి. కొన్ని రోజుల్లో కోతకి వస్టాయనుకున్న పంటలను నాశనం చేశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో సాగు చేసిన వరి, ప్రత్తి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు చాలా నష్టపోతున్నారు.
vo1: రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులు ,వంకలు పొంగిపొర్లాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరిన వరద కారణంగా ఏలేరు జలాశయం పూర్తిగా నిండింది. సుమారు 10వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.దీంతో కిర్లంపూడి, ప్రత్తిపాడు,గొల్లప్రోలు మండలాల్లోని వరి, పత్తి, మిరప పొలాల్లో నీరు చేరటంతో చెరువులను తలపిస్తున్నాయి. పంట పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. దాదాపు వరి 1000, పత్తి 400,మిరప 50నుంచి 100 ఎకరాలు నీట మునిగింది.దీంతో పెట్టిన పెట్టుబడి రూపాయి రాకుండా పోయిందని బోరుమంటున్నారు.
vo2: ఒక్కో ఎకరానికి 25వేల వరకు ఖర్చు అయిందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. కిర్లంపూడిలోని రాజుపాలెం వద్ద గండి పడే అవకాశం ఉండటంతో రైతులు ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నారు. ఒకవేళ అది గండి పడితే 500ఎకరాల వరి పంట నీట మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
evo: ఏలేరు జలాశయం నిండటం, వర్షాలు ఎక్కువగా పడటంతో చెరువుల్లోని నీరు రోడ్ల పైకి రావటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
శ్రీనివాస్,ప్రత్తిపాడు,617,ap10022
ప్రవీణ్,ejs


Conclusion:
Last Updated : Sep 28, 2019, 10:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.