ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి - గుంటూరులో రాళ్ల దాడి

ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నుంచి భారీగా విద్యార్థులు వస్తుండడం వల్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. కృష్ణా నది వంతెనపై ఇనుప కంచెలు వేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, యువకులు గాయపడ్డారు.

tension at guntur pondugula
రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి
author img

By

Published : Mar 26, 2020, 10:19 PM IST

రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

కరోనా ప్రభావంతో తెలంగాణ నుంచి రాష్ట్రానికి విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తోన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పొందుగుల అంతర్రాష్ట్ర సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా నది వంతెనపై ఇనుప కంచెలు వేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. విద్యార్థుల రాకను అడ్డుకున్న పోలీసుల వాహనాలపై యువకులు రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. వైద్య పరీక్షలు చేయించుకుని క్వారంటైన్‌కు సిద్ధపడిన వారినే ఏపీలోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. పొందుగులకు వైద్యులు చేరుకున్నారు. గుంటూరు అదనపు ఎస్పీ చక్రవర్తి సరిహద్దుల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

కరోనా ప్రభావంతో తెలంగాణ నుంచి రాష్ట్రానికి విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తోన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పొందుగుల అంతర్రాష్ట్ర సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా నది వంతెనపై ఇనుప కంచెలు వేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. విద్యార్థుల రాకను అడ్డుకున్న పోలీసుల వాహనాలపై యువకులు రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. వైద్య పరీక్షలు చేయించుకుని క్వారంటైన్‌కు సిద్ధపడిన వారినే ఏపీలోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. పొందుగులకు వైద్యులు చేరుకున్నారు. గుంటూరు అదనపు ఎస్పీ చక్రవర్తి సరిహద్దుల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా విలయంలోనూ.. ఆకలి తీరుస్తున్న సేవామూర్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.