కరోనా ప్రభావంతో తెలంగాణ నుంచి రాష్ట్రానికి విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తోన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పొందుగుల అంతర్రాష్ట్ర సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా నది వంతెనపై ఇనుప కంచెలు వేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. విద్యార్థుల రాకను అడ్డుకున్న పోలీసుల వాహనాలపై యువకులు రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. వైద్య పరీక్షలు చేయించుకుని క్వారంటైన్కు సిద్ధపడిన వారినే ఏపీలోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. పొందుగులకు వైద్యులు చేరుకున్నారు. గుంటూరు అదనపు ఎస్పీ చక్రవర్తి సరిహద్దుల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: