ETV Bharat / state

'సుధాకర్ ఆరోగ్యానికి హామీ ఏది..?' - డాక్టర్ సుధాకర్ ఘటన

తనకు సంబంధంలేని మందులిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్​కు మరో అస్పత్రిలో చికిత్స అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ శ్రావణ్​కుమార్ వాదనలు వినిపించారు.

Sudhakar prosecution in High Court
హైకోర్టు విచారణను వివరిస్తున్న న్యాయవాది సుధాకర్
author img

By

Published : May 30, 2020, 8:31 AM IST

హైకోర్టు విచారణను వివరిస్తున్న న్యాయవాది సుధాకర్

విశాఖ మానసిక వైద్యశాలలో తనకు సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ చికిత్సపై నమ్మకం లేదంటూ డాక్టర్‌ సుధాకర్ దాఖలు చేసిన రిట్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తాము మెరుగైన వైద్యం అందిస్తున్నామని హైకోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలపగా.. సుధాకర్ పోలీస్‌ కస్టడీలో ఉన్నారా? లేక జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారో తెలపాలని న్యాయమూర్తి ప్రశ్నించారు.

పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది రెండు రోజుల గడువు కోరగా.. ఈ రెండు రోజుల్లో సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. సుధాకర్‌ను తక్షణమే మరో ఆస్పత్రికి తరలించి, న్యాయస్థానం పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలని- అతని తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ కోరారు. ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా హోం, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ రమేశ్‌ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం

హైకోర్టు విచారణను వివరిస్తున్న న్యాయవాది సుధాకర్

విశాఖ మానసిక వైద్యశాలలో తనకు సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ చికిత్సపై నమ్మకం లేదంటూ డాక్టర్‌ సుధాకర్ దాఖలు చేసిన రిట్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తాము మెరుగైన వైద్యం అందిస్తున్నామని హైకోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలపగా.. సుధాకర్ పోలీస్‌ కస్టడీలో ఉన్నారా? లేక జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారో తెలపాలని న్యాయమూర్తి ప్రశ్నించారు.

పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది రెండు రోజుల గడువు కోరగా.. ఈ రెండు రోజుల్లో సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. సుధాకర్‌ను తక్షణమే మరో ఆస్పత్రికి తరలించి, న్యాయస్థానం పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలని- అతని తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ కోరారు. ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా హోం, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ రమేశ్‌ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.