విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో సురేష్బాబు మోహన్భగవత్కు ఆహ్వానం పలికారు. ముఖమండపం నుంచి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈవో సురేష్బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని మోహన్భగవత్కు అందజేశారు. రెండురోజులపాటు గుంటూరుజిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారకుల భైఠక్లో పాల్గొనేందుకు మోహన్ భగవత్ శుక్రవారం విజయవాడ వచ్చారు.
ఇదీ చదవండి