కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ గోవర్దన్ అనే వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు గోవర్దన్ కైకలూరులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: