విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం (bangaru bonam) సమర్పించారు. 12 ఏళ్లుగా అమ్మవారికి ఆనవాయితీగా ఈ బోనాన్ని హైదరాబాద్ పాతబస్తీ భక్తులు ఇస్తున్నారు. మీరాలంమండి గుడి ఛైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగురాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బోనం సమర్పిస్తామని వారు తెలిపారు. బోనం సమర్పించేందుకు వస్తున్న భక్తుల కోసం దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు చేశారు.కరోనా మహమ్మారిని తరిమేయాలని భక్తులు మొక్కుకున్నారు.
bangaru bonam :తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే 'బంగారు బోనం'
విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీ వాసులు బంగారు బోనం సమర్పించారు. నగరంలోని జమ్మిచెట్టు సెంటర్ నుంచి దుర్గ గుడి వరకు ర్యాలీగా వెళ్లి బోనం సమర్పించారు.
ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని బంగారు బోనాలు తీసుకొస్తున్న వారికి ఆహ్వానం పలికారు.
ఇదీ చూడండి. Third wave : నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదా..!
విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం (bangaru bonam) సమర్పించారు. 12 ఏళ్లుగా అమ్మవారికి ఆనవాయితీగా ఈ బోనాన్ని హైదరాబాద్ పాతబస్తీ భక్తులు ఇస్తున్నారు. మీరాలంమండి గుడి ఛైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగురాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బోనం సమర్పిస్తామని వారు తెలిపారు. బోనం సమర్పించేందుకు వస్తున్న భక్తుల కోసం దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు చేశారు.కరోనా మహమ్మారిని తరిమేయాలని భక్తులు మొక్కుకున్నారు.
ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని బంగారు బోనాలు తీసుకొస్తున్న వారికి ఆహ్వానం పలికారు.
ఇదీ చూడండి. Third wave : నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదా..!