తెలంగాణలోని హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైమానిక దళాధిపతి ఆర్.కె.ఎస్.భదౌరియా పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వారికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కర్నల్ సంతోష్బాబు బృందానికి నివాళులర్పించారు.కార్యక్రమంలో వైమానిక దళం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సూర్యకిరణ్, ధ్రువ హెలికాపర్లు, హాక్ జెట్ ట్రైనర్ల విన్యాసాలు ముఖ్య ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చూడండి: 'చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక 'ధూర్త శక్తి''