ETV Bharat / state

జీతాలు చెల్లించాలని పాతపాడులో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

తమకు జీతాలు ఇవ్వాలంటూ పారిశుద్ధ్య కార్మికులు పాతపాడులో ఆందోళన నిర్వహించారు. గ్రామ సచివాలయం ఏర్పాటు మంచిదే అయినప్పటికీ తమకు జీతాలు చెల్లించకపోవడం బాధగా ఉందన్నారు.

author img

By

Published : Oct 2, 2019, 8:38 PM IST

workwrs are protest at beside of village secretariate
జీతాలు చెల్లించాలని పాతపాడులో పారిశుద్ధ్యకార్మికుల ధర్నా..

కృష్ణాజిల్లా విజయవాడ మండలం పాతపాడులో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి ముందే పంచాయతీ కాంట్రాక్టు సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ రూరల్ మండలం సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని.. లేకుంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయం ఏర్పాటు మంచిదే అయినప్పటికీ జీతాల చెల్లింపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఐటీయు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే..ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి.రాష్ట్ర వ్యాప్తంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభ సందడి

జీతాలు చెల్లించాలని పాతపాడులో పారిశుద్ధ్యకార్మికుల ధర్నా..

కృష్ణాజిల్లా విజయవాడ మండలం పాతపాడులో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి ముందే పంచాయతీ కాంట్రాక్టు సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ రూరల్ మండలం సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని.. లేకుంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయం ఏర్పాటు మంచిదే అయినప్పటికీ జీతాల చెల్లింపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఐటీయు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే..ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి.రాష్ట్ర వ్యాప్తంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభ సందడి

Intro:ATP:- నాగరిక ప్రపంచంలో నేటి తరం చిన్నారులకు దూరమవుతున్న నైతిక విలువలు సంస్కృతి సంప్రదాయాలను కథ లేదా చిత్రం ద్వారా తెలియజేస్తాము అనంతపురంలోని కుటుంబం గత 30 ఏళ్లుగా ప్రతి సంవత్సరం బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి తమ నివాస చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు ప్రజలకు సంస్కృతి సాంప్రదాయాలపైన చైతన్యం కల్పిస్తున్నారు. దేవతల పురాణ కథలు, మానవ జీవన పరిస్థితులు తెలియజెప్పేలా ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.

* దసరా పండుగ అనగానే వెంటనే గుర్తొచ్చేది నవరాత్రులు, బొమ్మల కొలువు, సాంప్రదాయ వంటలు ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాల్లో క్షణం తీరిక లేని జీవితాలతో కాలం వెళ్ళదీస్తున్న కుటుంబాలు ఈ తరహా సంప్రదాయాలను అక్కడక్కడ మాత్రమే పాటిస్తున్నారు. అయితే అనంతపురం నగరంలోని ఆర్కే నగర్ కు చెందిన కమలాకర్, మల్లికా కుటుంబం మాత్రం వారసత్వ ఆస్తితో పాటు ఆ దంపతులకు ఇష్టమైన, వారికి వచ్చిన బొమ్మలతో గత 30 ఏళ్లుగా ప్రతి దసరా పండుగకు తమ నివాసంలో బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు. అందరిలా నవరాత్రుల్లో బొమ్మలు ఏర్పాటు చేస్తే ఏమ్ ఉంటుందనుకున్నారు. కానీ తాము ఏర్పాటుచేసే బొమ్మల కొలువుతో చిన్నారుల్లో నైతిక విలువలు, పెద్దలు తల్లిదండ్రులు పట్ల గౌరవం పెంపొందించే బొమ్మలు, దేవతల జీవిత కథలతో ఈ సంవత్సరం బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు . సెలవు రోజుల్లో చుట్టుపక్కల ఉన్న పిల్లలను పిలిచి వారికి దేవతల విశిష్టతలు కథలు బొమ్మలు చూపించి తెలియజేస్తున్నారు.


Body:* కమలాకర్,  మల్లికాల  కుటుంబం ఏ ప్రదేశానికి వెళ్ళినా తమకు సాంప్రదాయ విలువలు చాటే బొమ్మలను కొనడం అలవాటుగా మారింది.  ఈ నేపథ్యంలోనే అమెరికా,  చెన్నై,  సౌత్ కర్ణాటక,  పాండిచ్చేరి,  విజయవాడ దగ్గర ఉన్న కొండపల్లి,  హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి బొమ్మలను కొని దసరా పండుగ సందర్భంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు.

* ఈసారి బొమ్మల కొలువులో  మైసూర్ మహల్ ని ప్రత్యేకంగా ఉంచారు.    శ్రీకృష్ణుని విశ్వరూపం,  లడ్డు తింటున్న కృష్ణుడు,  శ్రీ లలితా దేవి వైభవం,  ఆకర్షణగా నిలిచాయి.  అలాగే శ్రీరామ జననం,  సీతా స్వయంవరం,  సీతాపహరణం,  జటాయు మరణం , శ్రీరామ పట్టాభిషేకం,  కుంభకర్ణుడి నిద్ర లేపడం,  గజేంద్రమోక్షం , శ్రీనివాస కళ్యాణం,  వరాహ లక్ష్మి సత్యనారాయణ వ్రతం మొదలగు బొమ్మలు ఏర్పాటు చేసి విశిష్టతను చాటుతున్నారు.  సమాజంలో ప్రతి ఒక్కరు సేవాభావం అలవర్చుకోవాలని నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిదని కుటుంబ దంపతులు తెలుపుతున్నారు.  బొమ్మలు కొనడం ద్వారా కళాకారునికి ఉపాధి లభిస్తుందని అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కనీసం ఒక బొమ్మ ని కొని కళాకారులకు చేయూత ఇవ్వాలని కోరుకుంటున్నారు.  ప్రకృతి,  పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని  ఈ అంశాన్ని ఈ బొమ్మల కొలువుల్లో తెలియజేస్తున్నారు.  ఇలాంటి విశేషాలను నేటి చిన్నారులకు తెలియజేస్తున్న మల్లిక దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

బైట్...1. మల్లిక,  బొమ్మలకొలువు నిర్వహిస్తున్న మహిళ

2. కమలాకర్,  బొమ్మలకొలువు నిర్వహకుడు.

3. తేజస్విని, స్థానికురాలు.
4. భవ్య, చిన్నారి.



Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.