ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు భాజపా కండువా కప్పుకోనున్నట్లు సమచారం. ఇవాళ ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ప్రధానితో భేటీ సమయంలో ఆయన వెంట మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మి ఉన్నారు. 45 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. ఈ సందర్భంగా భాజపాలో చేరాలని మోహన్ బాబుని మోదీ ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి సుముఖత వ్యక్తం చేసిన ఆయన... త్వరలో పార్టీలో చేరనున్నట్లు ప్రధానికి చెప్పినట్లు సమాచారం. అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ మోహన్బాబు కుటుంబం భేటీ అయ్యింది. మోహన్ బాబు ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
ఇదీ చదవండి: