కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ప్రజలు పురపాలక సంఘం సేవలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేశారు. ఇంటి వద్దకే సేవలను అందించేందుకు 9390939891 నంబరుతో ఏర్పాటు చేసిన సెల్ను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ నంబరు ద్వారా ప్రజలు వారి సమస్యలు, సలహాలను వాట్సాప్ ద్వారా నేరుగా ఫోటోలు, సందేశాలతో ఫిర్యాదులు చేయవచ్చు. పురపాలక సిబ్బంది ఫిర్యాదుదారుడిని తక్షణమే సంప్రదించి ఆయా సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తారని తెలిపారు.
ఇవీ చదవండి