ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతాం'

author img

By

Published : Aug 2, 2019, 4:37 PM IST

అతిగా ప్లాస్టిక్ ను వినియోగించటం వల్ల ప్రజలు అనేకసమస్యలు ఎదుర్కొంటున్నారని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. అందుకే విజయవాడని ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు

'ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతాం'

విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని... జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యలపై పాత్రికేయులతో చర్చించారు. తాను కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఆరునెలలు అవుతుందని... 2019 సార్వత్రిక ఎన్నికలలో జిల్లా సిబ్బంది, మీడియా ప్రతినిధులు చాలా సహకారాన్ని అందించారని తెలిపారు. యాంటీ ప్లాస్టిక్ డ్రైవ్ లో మీడియా పాత్ర ముఖ్యమైనదన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ లో వేడి పదార్థాలు వేసిన వాటిని తినడం వల్ల నేడు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మితి మీరిన ప్లాస్టిక్ వినియోగం వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అందుకే విజయవాడని ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు.

'ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతాం'

ఇవీ చదవండి...అక్కడ ' కోడికూత వినపడదు...పందులు కనపడవు'

విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని... జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యలపై పాత్రికేయులతో చర్చించారు. తాను కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఆరునెలలు అవుతుందని... 2019 సార్వత్రిక ఎన్నికలలో జిల్లా సిబ్బంది, మీడియా ప్రతినిధులు చాలా సహకారాన్ని అందించారని తెలిపారు. యాంటీ ప్లాస్టిక్ డ్రైవ్ లో మీడియా పాత్ర ముఖ్యమైనదన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ లో వేడి పదార్థాలు వేసిన వాటిని తినడం వల్ల నేడు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మితి మీరిన ప్లాస్టిక్ వినియోగం వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అందుకే విజయవాడని ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు.

'ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతాం'

ఇవీ చదవండి...అక్కడ ' కోడికూత వినపడదు...పందులు కనపడవు'

Intro:Ap_vja_18_02_eco_venayaka_vegrahalu_av_Ap10052
Sai babu_ Vijayawada : 9849803586

యాంకర్ : విజయవాడ లో వివిధ రకాల మట్టి వినాయక ప్రతిమలు సందడి చేస్తున్నాయి .వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండటంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను తయారుచేసే అమ్మకానికి పెట్టారు విజయవాడ ఎంజీ రోడ్డులోని భూమి ఆర్గానిక్స్ దుకాణ నిర్వాహకులు. తాము ఈ దుకాణాన్ని పెట్టి మూడో ఏడాది అయిందని గత ఏడాది 1,000 విగ్రహాలు పైగా మట్టి వినాయకులను అమ్మని ఈ ఏడాది రెండు వేల విగ్రహాలు అమ్మకానికి ఉంచినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ భారీ విగ్రహాలు వినియోగిస్తున్న వినాయక ఉత్సవ కమిటీలో ఇప్పుడిప్పుడే మార్పు కనపడుతుందని తమ వద్ద కూడా 7 అడుగుల విగ్రహం వరకు తయారు చేసి సిద్ధంగా ఉంచామని అంతేగాక గంగానది మట్టితో చేసిన విగ్రహాలు సుమారు 20 అవతారాలు కల వినాయక విగ్రహాలను తాము అందుబాటులో ఉంచామని ఈ ఏడాది విక్రయాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని భూమి ఆర్గానిక్ దుకాణం యజమాని తెలిపారు..
బైట్ : రఘు రామ్ .. భూమి ఆర్గానిక్ నిర్వాహకుడు.
బైట్: శంకర్..
బైట్: అక్బర్ .. ప్రకృతి వ్యవసాయ దారుడు
బైట్: గణేష్.. మట్టి విగ్రహ వినియోగదారుడు


Body:Ap_vja_18_02_eco_venayaka_vegrahalu_av_Ap10052


Conclusion:Ap_vja_18_02_eco_venayaka_vegrahalu_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.