ETV Bharat / state

Counting: కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు - కంటికచర్లలో ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ... ఈ పరిషత్ ఎన్నికల్లో పోటీలో లేకపోవటంతో జిల్లాలోని మెుత్తం 41 జెడ్పీటీసీ స్థానాల్లో 40 స్థానాలను అధికార వైకాపా గెలిచింది. 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 వైకాపా విజయం సాధించింది. తెదేపా గెలిచిన పలు స్థానాల్లో వైకాపా అభ్యర్థులు రీకౌంటింగ్​కు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎక్కడా విజయోత్సవాలు నిర్వహించకూడదని ఆదేశాలు ఉన్నా..నిబంధనలు అతిక్రమించి అవనిగడ్డలో నిర్వహించారు.

కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు
కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు
author img

By

Published : Sep 19, 2021, 10:38 AM IST

Updated : Sep 19, 2021, 10:50 PM IST

కృష్ణా జిల్లాలోని మెుత్తం 17 కేంద్రాల్లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఒకటి రెండు చోట్ల మినహా మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ను అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 63 శాతం పోలింగ్ శాతం నమోదై ఉండడంతో..చాలాచోట్ల సాయంత్రానికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తైంది.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లోనికి ఎవరూ రాకుండా అన్ని దారుల్లో అరకిలోమీటరు దూరం నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు 144 సెక్షను అమలు చేసి వాహనాలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ పరిషత్ ఎన్నికల్లో పోటీలో లేకపోవటంతో జిల్లాలోని మెుత్తం 41 జెడ్పీటీసీ స్థానాల్లో 40 స్థానాలను అధికార వైకాపా గెలిచింది. 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 వైకాపా విజయం సాధించింది. తెదేపా 63, జనసేన 9, భాజపా 1, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసు అధికారులు పదేపదే సూచించినా ఒకటి రెండు చోట్ల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

నందిగామ మండలంలోని రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి నాగమణి రెండు ఓట్ల తేడాతో గెలిచారు.ఈ నేపథ్యంలో రీకౌంటింగ్‌ నిర్వహించగా ఒక్క ఓటు ఆధిక్యం కనిపించింది. మళ్లీ మూడోసారి కూడా రీకౌంటింగ్‌ చేయగా. ఈసారి మూడు ఓట తేడా కనిపించింది. కృత్తివెన్ను మండలం నిడమర్రు-2 ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి పది ఓట్లతో గెలుపొందగా..రీకౌంటింగ్‌ చేశారు. మళ్లీ తెదేపా అభ్యర్థే ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బాపులపాడు మండలం ఓగిరాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ నేపథ్యంలో వైకాపా అభ్యర్థి రీకౌంటింగ్‌ కి పట్టుపట్టగా వైకాపా అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం వచ్చింది. దీంతో మూడోసారి మళ్లీ లెక్కించారు. చివరికి తెదేపా అభ్యర్థి సుబ్బారావు రెండు ఓట్ల తేడాతో గెలిచారు.

పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ విజయోత్సవాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా.. అధికార పార్టీ శ్రేణులు కొన్నిచోట్ల ఉల్లంఘించాయి. అవనిగడ్డలో వైకాపా శ్రేణులు బాణసంచా కాల్చి, వందలాది మందితో ప్రదర్శన చేపట్టారు. అనంతరం పార్టీ జెండాలు పట్టుకుని బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద నుంచి డీజే బాక్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

గన్నవరం సెయింట్‌జాన్స్‌ పాఠశాలలో నిర్వహించిన కౌంటింగ్‌ గంటకు పైగా ఆలస్యమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..అరగంటకుపైగా ఆలస్యమైంది. మరికొన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలెట్లను సమయానికి తెరిచినా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగింది. గొట్టిముక్కల కౌంటింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కొన్ని కేంద్రాల్లో పూర్తిగా చెల్లలేదు. గెజిటెడ్‌ సంతకం చేసినా.. డిక్లరేషన్‌ జత చేయకపోవడంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లలేదు. ఇబ్రహీంపట్నం నోవా కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో నాలుగు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రాగా.. దేనికీ డిక్లరేషన్‌ లేకపోవడంతో పక్కన పెట్టేశారు. ముదినేపల్లి మండలంలోనూ మూడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వస్తే.. మూడు చెల్లలేదు. మొవ్వలోనూ 16 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. ఇలాగే జిల్లాలోని మరికొన్ని కేంద్రాల్లోనూ డిక్లరేషన్‌ జత చేయకపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు. విజయవాడ గ్రామీణ మండలంలోని నిడమానూరు వన్‌ ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన ఓ బ్యాలెట్‌ బాక్సులో ఉన్న ఓట్లన్నీ తడిసిపోయాయి. దీంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే చివరికి ఆ తడిసిన ఓట్లను జాగ్రత్తగా బయటకు తీసి లెక్కించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా కౌంటింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. నందిగామలో జరిగిన చందర్లపాడు మండల కౌంటింగ్‌ కేంద్రంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కౌంటింగ్‌ కేంద్రంలో ఉక్కపోత, చీకటిగా ఉండడంతో ఏజెంట్లు, సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. చివరికి జనరేటర్‌ ఏర్పాటు చేశారు. కంచికచర్ల కౌంటింగ్‌ కేంద్రం వద్ద తహసీల్దారు రాజకుమారి అస్వస్థతకు గురికావటంతో.. 104 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి కేంద్రాల వద్ద కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీనికోసం వైద్యారోగ్యశాఖ సిబ్బంది అన్ని కేంద్రాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది వాక్సినేషన్‌ చేసుకున్న, కొవిడ్‌ పరీక్షకు సంబంధించిన పత్రాలను చూపించాకే లోపలికి అనుమతించారు.

కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు
కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు

ఇదీ చదవండి:

Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

కృష్ణా జిల్లాలోని మెుత్తం 17 కేంద్రాల్లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఒకటి రెండు చోట్ల మినహా మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ను అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 63 శాతం పోలింగ్ శాతం నమోదై ఉండడంతో..చాలాచోట్ల సాయంత్రానికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తైంది.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లోనికి ఎవరూ రాకుండా అన్ని దారుల్లో అరకిలోమీటరు దూరం నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు 144 సెక్షను అమలు చేసి వాహనాలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ పరిషత్ ఎన్నికల్లో పోటీలో లేకపోవటంతో జిల్లాలోని మెుత్తం 41 జెడ్పీటీసీ స్థానాల్లో 40 స్థానాలను అధికార వైకాపా గెలిచింది. 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 వైకాపా విజయం సాధించింది. తెదేపా 63, జనసేన 9, భాజపా 1, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసు అధికారులు పదేపదే సూచించినా ఒకటి రెండు చోట్ల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

నందిగామ మండలంలోని రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి నాగమణి రెండు ఓట్ల తేడాతో గెలిచారు.ఈ నేపథ్యంలో రీకౌంటింగ్‌ నిర్వహించగా ఒక్క ఓటు ఆధిక్యం కనిపించింది. మళ్లీ మూడోసారి కూడా రీకౌంటింగ్‌ చేయగా. ఈసారి మూడు ఓట తేడా కనిపించింది. కృత్తివెన్ను మండలం నిడమర్రు-2 ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి పది ఓట్లతో గెలుపొందగా..రీకౌంటింగ్‌ చేశారు. మళ్లీ తెదేపా అభ్యర్థే ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బాపులపాడు మండలం ఓగిరాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ నేపథ్యంలో వైకాపా అభ్యర్థి రీకౌంటింగ్‌ కి పట్టుపట్టగా వైకాపా అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం వచ్చింది. దీంతో మూడోసారి మళ్లీ లెక్కించారు. చివరికి తెదేపా అభ్యర్థి సుబ్బారావు రెండు ఓట్ల తేడాతో గెలిచారు.

పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ విజయోత్సవాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా.. అధికార పార్టీ శ్రేణులు కొన్నిచోట్ల ఉల్లంఘించాయి. అవనిగడ్డలో వైకాపా శ్రేణులు బాణసంచా కాల్చి, వందలాది మందితో ప్రదర్శన చేపట్టారు. అనంతరం పార్టీ జెండాలు పట్టుకుని బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద నుంచి డీజే బాక్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

గన్నవరం సెయింట్‌జాన్స్‌ పాఠశాలలో నిర్వహించిన కౌంటింగ్‌ గంటకు పైగా ఆలస్యమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..అరగంటకుపైగా ఆలస్యమైంది. మరికొన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలెట్లను సమయానికి తెరిచినా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగింది. గొట్టిముక్కల కౌంటింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కొన్ని కేంద్రాల్లో పూర్తిగా చెల్లలేదు. గెజిటెడ్‌ సంతకం చేసినా.. డిక్లరేషన్‌ జత చేయకపోవడంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లలేదు. ఇబ్రహీంపట్నం నోవా కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో నాలుగు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రాగా.. దేనికీ డిక్లరేషన్‌ లేకపోవడంతో పక్కన పెట్టేశారు. ముదినేపల్లి మండలంలోనూ మూడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వస్తే.. మూడు చెల్లలేదు. మొవ్వలోనూ 16 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. ఇలాగే జిల్లాలోని మరికొన్ని కేంద్రాల్లోనూ డిక్లరేషన్‌ జత చేయకపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు. విజయవాడ గ్రామీణ మండలంలోని నిడమానూరు వన్‌ ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన ఓ బ్యాలెట్‌ బాక్సులో ఉన్న ఓట్లన్నీ తడిసిపోయాయి. దీంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే చివరికి ఆ తడిసిన ఓట్లను జాగ్రత్తగా బయటకు తీసి లెక్కించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా కౌంటింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. నందిగామలో జరిగిన చందర్లపాడు మండల కౌంటింగ్‌ కేంద్రంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కౌంటింగ్‌ కేంద్రంలో ఉక్కపోత, చీకటిగా ఉండడంతో ఏజెంట్లు, సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. చివరికి జనరేటర్‌ ఏర్పాటు చేశారు. కంచికచర్ల కౌంటింగ్‌ కేంద్రం వద్ద తహసీల్దారు రాజకుమారి అస్వస్థతకు గురికావటంతో.. 104 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి కేంద్రాల వద్ద కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీనికోసం వైద్యారోగ్యశాఖ సిబ్బంది అన్ని కేంద్రాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది వాక్సినేషన్‌ చేసుకున్న, కొవిడ్‌ పరీక్షకు సంబంధించిన పత్రాలను చూపించాకే లోపలికి అనుమతించారు.

కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు
కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు

ఇదీ చదవండి:

Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Last Updated : Sep 19, 2021, 10:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.