కృష్ణా జిల్లా గొర్రెలు, మేకల కాపరుల కోపరేటివ్ యూనియన్ బాధ్యులు రామకృష్ణ... విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదవశాత్తు గొర్రెలు చనిపోతే... ఎటువంటి బీమా లేకుండా రూ.6వేల పరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఎస్సీడీసీ రుణాలు రూ.2 లక్షలు... 50 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బడ్జెట్లో గొర్రెల ఫెడరేషన్కు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు. గొర్రెల కాపరుల కుటుంబాల్లో పట్టభద్రులైన నిరుద్యోగులకు రూ.25 లక్షల రుణాలు మంజూరు చేసి... 50 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: కృష్ణానదిలో చిక్కుకున్న గొర్రెలు... కాపాడిన కొక్కిలిగడ్డ వాసులు