తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విజయవాడలో తెదేపా శ్రేణులు ధర్నా చేశాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్.. కేసీఆర్తో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఓటమి భయంతోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా ఓటుతో జగన్కు బుద్ధి చెప్పాలన్నారు. ధర్నా అనంతరం డీఆర్ఓ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఓట్ల తొలగింపు వైకాపా పనే అని...ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..
'మన కష్టాలకు కేసీఆరే కారణం'
అరాచకమే.. వైకాపా అజెండా'