కేవలం మగవారికే సొంతమైన మృదంగ వాద్య విద్యలో... వారితో ధీటుగా పోటీపడి... శ్రోతలను, రసజ్ఞులను అమితంగా అలరించి... పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు తెలుగు మహిళ దండమూడి సుమతి. పురుషాధిక్యం బలంగా ఉన్న రోజుల్లోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి... తనదైన ప్రతిభను చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1950వ సంవత్సరంలో సుమతి జన్మించారు. తొలుత తండ్రి రాఘవయ్య వద్ద మృదంగం నేర్చుకున్నారు. ఆ తర్వాత విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో మృదంగ విద్వాంసుడు దండమూడి రామ్మోహనరావు వద్ద శిక్షణ పొందారు. దేశవిదేశాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. మృదంగ విదుషి, మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, వంటి అనేక బిరుదులు పొందారు. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం సుమతిని వరించింది. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా సుమతితో ముఖాముఖి.
ఇదీ చదవండీ... న్యాయం అందించే విషయంలో.. న్యాయవ్యవస్థ రాజీ పడకూడదు: హైకోర్టు సీజే