విజయవాడలో గాంధీ సంకల్ప యాత్ర పేరుతో ముంద్రించిన పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. గాంధీ సంకల్పయాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. యాత్రలోని ముఖ్య ఘట్టాలను పుస్తకంలో పొందుపరిచినట్లు భాజపా నేతలు వెల్లడించారు. జిల్లాలో వారీగా సంకల్పయాత్రలో ప్రముఖ పాత్ర పోషించిన యాత్ర ప్రముఖులను కన్నా చేతుల మీదుగా సత్కరించారు. భారతదేశాన్ని 70 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ పేరు పెట్టుకుని ఆయన ఆశయాలను మాత్రం తుంగలో తొక్కారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీ... వారి పేర్ల చివర జిన్నా అని పెట్టుకుంటే సముచితంగా ఉంటుందని జీవీఎల్ దుయ్యబట్టారు.
ఇదీచూడండి.మీకు నచ్చిన పింఛన్ ఎంచుకోవచ్చు