ETV Bharat / state

కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా

author img

By

Published : May 22, 2021, 5:44 PM IST

చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ పరామర్శించారు. వాళ్లతో ఫోన్​లో మాట్లాడిన ఆయన.. అందుతున్న వైద్య సేవలు, డైట్ గురించి ఆరా తీశారు.

collector Imtiaz talk with covid patients
collector Imtiaz talk with covid patients

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు కొవిడ్ బాధితులు, వారి కుటుంబ సభ్యులతో కలెక్టర్ ఇంతియాజ్ ఫోన్​లో మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆహార పదార్ధాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కరోనా లక్షణాలు తగ్గినా ఆక్సిజన్‌ సామర్ధ్యం మెరుగుపడేందుకు చికిత్స పొందుతున్నట్లు వలువురు చెప్పారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతున్నందున.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు కోరారు. కొవిడ్ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు కొవిడ్ బాధితులు, వారి కుటుంబ సభ్యులతో కలెక్టర్ ఇంతియాజ్ ఫోన్​లో మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆహార పదార్ధాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కరోనా లక్షణాలు తగ్గినా ఆక్సిజన్‌ సామర్ధ్యం మెరుగుపడేందుకు చికిత్స పొందుతున్నట్లు వలువురు చెప్పారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతున్నందున.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు కోరారు. కొవిడ్ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి..

తిరుపతి: రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.