డీజీపీ కార్యాలయం ఎదుట చంద్రబాబు బైఠాయింపు - డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన చంద్రబాబు
గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలపై దాడిని నిరసిస్తూ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిరసనకు దిగారు. ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. డీజీపీ కార్యాలయం ప్రధాన గేటును పోలీసులు మూసివేయగా.. అక్కడే చంద్రబాబు, రామకృష్ణ, నేతలు బైఠాయించారు. ఆ ప్రాంతానికి అదనపు డీజీ రవిశంకర్ వెళ్లారు. మాచర్లలో జరిగిన దాడి గురించి చంద్రబాబు ఆయనకు వివరించారు. బుద్దా వెంకన్న, బొండా ఉమ తమకు తగిలిన గాయాలు చూపించారు.