ETV Bharat / state

'అక్రమ కేసులు పెడితే సమస్యలు పరిష్కారమవుతాయా..?' - ట్విట్టర్​లో ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు

తెదేపా కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. కేసులు పెడితే సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ ట్విట్టర్​ వేదికగా నిలదీశారు. రాజకీయ వేధింపులకు స్వస్తి పలికి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

చంద్రబాబు విమర్శలు
author img

By

Published : Oct 12, 2019, 1:36 AM IST

తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో తమ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్​, వెలగపూడి రామకృష్ణలపై కేసులు పెట్టారన్న ఆయన... అక్రమ కేసులు పెడితే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ ట్విట్టర్​ వేదికగా నిలదీశారు. ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.

ఇసుక కొరత మరో అరాచకం

ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి పేదల పొట్టకొట్టడాన్ని నిరసిస్తూ... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తోన్న 36 గంటల దీక్షను అడ్డుకోవడం మరో అరాచకమని మండిపడ్డారు. ప్రజాందోళనలు అణచి వేయడంపై పెట్టే శ్రద్ధలో పదో వంతు పేదల సమస్యల పరిష్కారంపై పెడితే ఈ దుస్థితి ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

విశాఖలో సమీక్ష

విశాఖలో గాజువాక, విశాఖ ఉత్తరం, భీమిలికి చెందిన పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధినేత అనుమతితో ఈ సమావేశానికి హాజరు కాలేదు.

ఇదీ చూడండి:

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా...?

తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో తమ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్​, వెలగపూడి రామకృష్ణలపై కేసులు పెట్టారన్న ఆయన... అక్రమ కేసులు పెడితే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ ట్విట్టర్​ వేదికగా నిలదీశారు. ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.

ఇసుక కొరత మరో అరాచకం

ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి పేదల పొట్టకొట్టడాన్ని నిరసిస్తూ... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తోన్న 36 గంటల దీక్షను అడ్డుకోవడం మరో అరాచకమని మండిపడ్డారు. ప్రజాందోళనలు అణచి వేయడంపై పెట్టే శ్రద్ధలో పదో వంతు పేదల సమస్యల పరిష్కారంపై పెడితే ఈ దుస్థితి ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

విశాఖలో సమీక్ష

విశాఖలో గాజువాక, విశాఖ ఉత్తరం, భీమిలికి చెందిన పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధినేత అనుమతితో ఈ సమావేశానికి హాజరు కాలేదు.

ఇదీ చూడండి:

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా...?

Intro:AP_TPG_23_11_BJP_VISIT_POLAVARAM_AVB_AP10088
యాంకర్: పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని బయటకు తీయకుండా రివర్స్ టెండరింగ్ పిలవడం ఏమిటని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి పోలవరం ప్రాజెక్టును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బృందం పరిశీలించారు. ప్రాజెక్ట్ హిల్ వ్యూ నుంచి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పోలవరం ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం భూసేకరణ లో జరిగిన అవకతవకలను వెలికి తీసి భాద్యులపై చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెదేపా, వైకాపా ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు ఆంద్రప్రదేశ్ లో పోలవరం ఆగిపోతే రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు క్విడ్ పొక్రోతో పోలవరం ను నాశనం చెయ్యాలని చూస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ తో రాష్ట్రానికి ఏమాత్రం సభంధం లేదని నిర్మాణ విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా రెండు పార్టీల ను ద్రోహులుగా ప్రజల ముందు నిలబెడతామని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇతర నాయకులు ప్రాజెక్ట్ సందర్శనలో పాల్గొన్నారు

బైట్స్: వై. సత్యకుమార్ భాజపా జాతీయ కార్యదర్శి

(2) విష్ణు వర్ధన్ రెడ్డి, భాజపా, రాష్ట్ర ఉపాధ్యక్షుడుBody:Bjp visit polavaramConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.