తొలిదశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన క్యాన్సర్ మారథాన్ను డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. 5 కిలోమీటర్ల మేర సాగిన మారథాన్లో.. పోలీసు సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 103 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. ప్రజలందరూ వ్యాయామం మీద మరింత దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చదవండి: జగన్ అక్రమాస్తుల కేసులో ఇక రోజువారీ విచారణ