కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటలో నందిగామ పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గ్రామ సమీపంలో అక్రమ బ్లాస్టింగ్ జరుగుతుందన్న డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టారు. తనిఖీల్లో సుమారు రూ.2లక్షలు విలువైన బ్లాస్టింగ్ పదార్థాలు, బ్లాస్టింగ్ వాహనం, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా బ్లాస్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: Suicide: ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య