ETV Bharat / state

అన్నార్తులకు అండగా.... ఆకలి తీరుస్తున్న అమృతహస్తం - విజయవాడలో అన్నార్థులకు అండగా అమృతహస్తం

అన్నదానం కన్నా గొప్పదానం ఈ ప్రపంచంలో ఏదీ లేదంటారు పెద్దలు.. దశాబ్దకాలంగా అన్నార్తుల ఆకలి తీరుస్తూ ఆపన్నహస్తం అందిస్తోంది ... విజయవాడలోని అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ, మీకు మేమున్నామంటూ లక్షలాది మంది ఆకలి తీరుస్తున్నారు ట్రస్ట్​ సభ్యులు.

amrutha hastam trust distributes food for migrant labour at krishna
అన్నార్థులకు అండగా.... అమృతహస్తం
author img

By

Published : Jun 22, 2020, 2:19 PM IST

Updated : Jun 22, 2020, 5:11 PM IST

కృష్ణా జిల్లా విజయవాడలోని అమృతహస్తం చారిటబుల్​ ట్రస్ట్​ దాదాపుగా దశాబ్ద కాలంగా అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ మేమున్నామటూ లక్షలాది మంది ఆకలి తీరుస్తోంది. కార్మికులు, కూలీలు... ఇలా అందరికీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ఆహారాన్నీ అందించారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్లలో... విజయవాడ నుంచి వెళ్లే వారికి ఆహార, పానీయాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా సంక్షోభంలోనూ, అమృతహస్తం సభ్యులు దాతల సహకారంతో, 92 రోజుల పాటు... దాదాపు 9లక్షల మంది ఆకలి తీర్చారు. ఇప్పటివరకు 30 వేల మందికి సరిపడా ఆహార పానియాలు అందించారు.

విజయవాడ నుంచి ఈరోజు చివరి శ్రామిక్​ రైలు వెళ్లడంతో, ఇన్​కం​టాక్స్​ చీఫ్​ కమిషనర్​ పీయూష్​ కుమార్​, ఐటీసీ అందించిన సహకారంతో వలస కూలీలకు ఆహార పానియాలు అందించినట్లు అమృతహస్తం డైరెక్టర్ ధారా కరుణశ్రీ తెలిపారు.

కృష్ణా జిల్లా విజయవాడలోని అమృతహస్తం చారిటబుల్​ ట్రస్ట్​ దాదాపుగా దశాబ్ద కాలంగా అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ మేమున్నామటూ లక్షలాది మంది ఆకలి తీరుస్తోంది. కార్మికులు, కూలీలు... ఇలా అందరికీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ఆహారాన్నీ అందించారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్లలో... విజయవాడ నుంచి వెళ్లే వారికి ఆహార, పానీయాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా సంక్షోభంలోనూ, అమృతహస్తం సభ్యులు దాతల సహకారంతో, 92 రోజుల పాటు... దాదాపు 9లక్షల మంది ఆకలి తీర్చారు. ఇప్పటివరకు 30 వేల మందికి సరిపడా ఆహార పానియాలు అందించారు.

విజయవాడ నుంచి ఈరోజు చివరి శ్రామిక్​ రైలు వెళ్లడంతో, ఇన్​కం​టాక్స్​ చీఫ్​ కమిషనర్​ పీయూష్​ కుమార్​, ఐటీసీ అందించిన సహకారంతో వలస కూలీలకు ఆహార పానియాలు అందించినట్లు అమృతహస్తం డైరెక్టర్ ధారా కరుణశ్రీ తెలిపారు.

ఇవీ చూడండి:కరోనా ప్రభావం: పాఠశాలల పునఃప్రారంభంపై కొనసాగుతున్న అయోమయం

Last Updated : Jun 22, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.