ETV Bharat / state

అనధికారికంగా కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స..ఆసుపత్రి సీజ్‌ - గుంటూరు అనధికార కరోనా ఆసుపత్రి సీజ్

ఎటువంటి అనుమతులు లేకుండా.. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

unauthorized covid hospital seized
ఆసుపత్రి సీజ్‌
author img

By

Published : Aug 11, 2020, 10:31 PM IST

గుంటూరు నగరంలో అనధికారికంగా కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిని రెవెన్యూ, పోలీసు అధికారులు పరిశీలించి సీజ్‌ చేశారు. కొత్తపేట పరిధిలోని గుంటూరువారితోట 7వలేనులో ఓ ఆసుపత్రిలో కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక ప్రజల నుంచి సమాచారం అందుకున్న తహశీల్దార్‌ శ్రీకాంత్‌, కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డిలు ఆసుపత్రిలో తనిఖీ చేపట్టగా.. ముగ్గురు కొవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లుగా గుర్తించారు. అందులో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అనధికారికంగా కరోనా చికిత్స నిర్వహిస్తున్నందున ఆసుపత్రిలోని పేషెంట్లను కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి, ఆసుపత్రిని సీజ్‌ చేసినట్లు తహశీల్దార్‌ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్​కు నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు.

గుంటూరు నగరంలో అనధికారికంగా కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిని రెవెన్యూ, పోలీసు అధికారులు పరిశీలించి సీజ్‌ చేశారు. కొత్తపేట పరిధిలోని గుంటూరువారితోట 7వలేనులో ఓ ఆసుపత్రిలో కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక ప్రజల నుంచి సమాచారం అందుకున్న తహశీల్దార్‌ శ్రీకాంత్‌, కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డిలు ఆసుపత్రిలో తనిఖీ చేపట్టగా.. ముగ్గురు కొవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లుగా గుర్తించారు. అందులో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అనధికారికంగా కరోనా చికిత్స నిర్వహిస్తున్నందున ఆసుపత్రిలోని పేషెంట్లను కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి, ఆసుపత్రిని సీజ్‌ చేసినట్లు తహశీల్దార్‌ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్​కు నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: అద్దె ఇంట్లో 2 సార్లు దొంగతనం.. విచారణలో తేలిన మరో నిజం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.