బాపట్ల మండలం పాండురంగాపురం బీచ్లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరు ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన గెల్లా రాజేష్, అట్లూరి మోజెస్గా పోలీసులు గుర్తించారు. మార్టూరు నుంచి 18 మంది యువకులు సూర్యలంక బీచ్కు రాగా.. కొవిడ్ నేపథ్యంలో పోలీసులు పర్యాటకులను అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో పాండురంగాపురం తీరానికి వచ్చి సముద్ర స్నానం చేశారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల వీరు నీటిలో మునిగి గల్లంతయ్యారు. మత్స్యకారుల సాయంతో వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: