గుంటూరు జిల్లా నరసరావుపేటలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 182కు చేరుకుంది. బుధవారం నమోదైన 2 కేసుల్లో ఒకటి వరవకట్ట కాగా మరొకటి పెద్దచెరువుకు చెందినది. ఈ రెండు కేసులు క్వారంటైన్లో ఉన్నవారివే అని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పట్టణంలో ఉదయం పూట అధికారులు ఇచ్చిన సడలింపులో ప్రజలు భౌతికదూరం పాటిస్తూ... మాస్కులు ధరించి శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: వలస కార్మికులకు ఆహారం పంపిణీ