ETV Bharat / state

కారు ప్రమాదంలో సోదరులు మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

తెలంగాణలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన ఇద్దరు సోదరులు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.

author img

By

Published : Feb 23, 2021, 4:06 PM IST

accident
కారు ప్రమాదంలో సోదరులు మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న సోదరులు కారు ప్రమాదంలో మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అన్నదమ్ముల మృతితో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన శ్రీనివాసరావుకు భార్య, ముగ్గురు పిల్లలుండగా.. రాంబాబుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మాల్యాలపల్లి వద్ద కారు అదుపుతప్పి ఈ దుర్ఘటన జరిగింది.

బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న సోదరులు కారు ప్రమాదంలో మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అన్నదమ్ముల మృతితో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన శ్రీనివాసరావుకు భార్య, ముగ్గురు పిల్లలుండగా.. రాంబాబుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మాల్యాలపల్లి వద్ద కారు అదుపుతప్పి ఈ దుర్ఘటన జరిగింది.

ఇదీ చదవండి: రూ.కోటి బంగారం తీసుకెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు వ్యాపారుల మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.