ETV Bharat / state

జిల్లాలో 237కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Apr 27, 2020, 6:07 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా పరీక్షలు పెంచినప్పటి నుంచి... కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇవాళ గుంటూరులో 23 కేసులు నమోదయ్యాయి.

the-intensity-of-corona-cases-in-the-state-continues-to-rise
గుంటూరులో పెరుగుతున్న కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 237కు చేరింది. ఇవాళ కొత్తగా 23 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి గుంటూరు నగరంలో 134, నర్సరావుపేటలో 64కు చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటిదాకా 8 మంది మృతిచెందగా... 29 మందికి వ్యాధి నయమైంది. ఇంకా 200 మంది బాధితులు గుంటూరు ఐడీ ఆసుపత్రి, ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

లాక్​డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గుంటూరు, నర్సరావుపేటను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. ఈ రెండు చోట్లా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత ఎవరైనా బయటకు వస్తే వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మందకొడిగా నమూనాలు సేకరణ, నిర్ధరణ

కేసుల పరంగా చూస్తే గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులు, వారిని కలిసిన వారిని, చుట్టుపక్కల వారిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే క్వారంటైన్ కేంద్రాల్లో నమూనాలు తీసుకునే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అలాగే కరోనా నిర్ధరణ ఫలితాలు కూడా త్వరగా రావట్లేదు. అందుకే నమూనాల సేకరణ, నిర్ధరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 237కు చేరింది. ఇవాళ కొత్తగా 23 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి గుంటూరు నగరంలో 134, నర్సరావుపేటలో 64కు చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటిదాకా 8 మంది మృతిచెందగా... 29 మందికి వ్యాధి నయమైంది. ఇంకా 200 మంది బాధితులు గుంటూరు ఐడీ ఆసుపత్రి, ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

లాక్​డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గుంటూరు, నర్సరావుపేటను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. ఈ రెండు చోట్లా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత ఎవరైనా బయటకు వస్తే వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మందకొడిగా నమూనాలు సేకరణ, నిర్ధరణ

కేసుల పరంగా చూస్తే గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులు, వారిని కలిసిన వారిని, చుట్టుపక్కల వారిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే క్వారంటైన్ కేంద్రాల్లో నమూనాలు తీసుకునే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అలాగే కరోనా నిర్ధరణ ఫలితాలు కూడా త్వరగా రావట్లేదు. అందుకే నమూనాల సేకరణ, నిర్ధరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.