ETV Bharat / state

తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్ - maddiboinapalem telnagana liquor

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని.. గుంటూరు జిల్లా మద్దిబోయినపాలెంలో విక్రయిస్తున్న ఇద్దర్ని అబ్కారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 228 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

telangana liquor caught
తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Aug 3, 2020, 2:17 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలం మద్దిబోయినవారిపాలెంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న అబ్కారీ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన జర్నీ నాగరాజు, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన తాత గంగారావు తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్దిబోయినవారిపాలెంలో తెలంగాణ మద్యం విక్రయించేందుకు... తాత గంగారావు అద్దంకి నుంచి ఆటోలో తీసుకువచ్చే వాడని పోలీసులు వెల్లడించారు. దీంతో అబ్కారీ శాఖ అధికారులు దాడులు చేసి.. పశువల చావిడిలో దాచి ఉంచిన 228 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని.. ఇద్దర్నీ అరెస్టు చేశారు.

గుంటూరు జిల్లా బాపట్ల మండలం మద్దిబోయినవారిపాలెంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న అబ్కారీ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన జర్నీ నాగరాజు, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన తాత గంగారావు తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్దిబోయినవారిపాలెంలో తెలంగాణ మద్యం విక్రయించేందుకు... తాత గంగారావు అద్దంకి నుంచి ఆటోలో తీసుకువచ్చే వాడని పోలీసులు వెల్లడించారు. దీంతో అబ్కారీ శాఖ అధికారులు దాడులు చేసి.. పశువల చావిడిలో దాచి ఉంచిన 228 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని.. ఇద్దర్నీ అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: కరోనా పాజిటివ్​ వ్యక్తి అత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.