గుంటూరు జిల్లా అప్పికట్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిపై సహోపాధ్యాయులు దాడి చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్ సోమవారం పిల్లలను క్రీడా ప్రాంగణంలో ఆడించడానికి తీసుకువెళ్తుండగా తాము కూడా గ్రౌండ్కు వచ్చి ఆడతామని సహోపాధ్యాయులు శివయ్య, జయరావు, బుల్లయ్య అన్నారు. విద్యార్థులు, సహోపాధ్యాయులు గ్రౌండ్కు చేరుకోగానే వారిని ఆడుకోవాలని చెప్పి ఏదో పని మీద వెంకటేశ్ తిరిగి హెచ్ఎం గది వద్దకు బయలుదేరాడు. తమను గ్రౌండ్లో ఉంచి నీవు ఏం చేద్దామని వెళుతున్నావని సహోపాధ్యాయులు దుర్భాషలాడుతూ వెంకటేశ్పై దాడి చేశారు. దీంతో ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, డీఈవో గంగాభవానికి ఫిర్యాదు చేశారు. తనపై శివయ్య, జయరావు, బుల్లయ్య హత్యాయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని, అప్పటి వరకూ ముగ్గురు ఉపాధ్యాయులూ సస్పెన్షన్లో ఉంటారని డీఈఓ తెలిపారు. పాఠశాలలో తమకు తగిన ప్రాధాన్యం లభించకపోవడాన్ని మనసులో పెట్టుకొనే ముగ్గురు ఉపాధ్యాయులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్