ETV Bharat / state

ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే.. సస్పెండ్​ చేస్తారా: తెదేపా

45 ఏళ్లు నిండిన ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని తెదేపా నేతలు తెలిపారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నించినందుకు తమ సభ్యులను సస్పెండ్ చెయ్యడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 23, 2019, 3:40 PM IST

tdp fire on ycp
ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే.. సస్పెండ్​ చేస్తారా: తెదేపా

వైకాపా ఎన్నికల హామీలకు.. చేసేదానికి చాలా తేడా ఉందని తెదేపా నేతలు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో కళా వెంకట్రావు, ఆలపాటి, వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారని.. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌ ఇస్తామన్నారని తెదేపా నేతలు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని సభలో అడిగినందుకు తమ సభ్యులను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే.. సస్పెండ్​ చేస్తారా: తెదేపా

వైకాపా ఎన్నికల హామీలకు.. చేసేదానికి చాలా తేడా ఉందని తెదేపా నేతలు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో కళా వెంకట్రావు, ఆలపాటి, వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారని.. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌ ఇస్తామన్నారని తెదేపా నేతలు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని సభలో అడిగినందుకు తమ సభ్యులను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:* మంగలాoబిక మహారాణిగా పుష్పపల్లకి పై ఊరేగిన కలికిరి ఎల్లమ్మ ....
చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారు సోమవారం రాత్రి పుష్ప పల్లకిపై ఊరేగారు. సువాసన భరితమైన ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పల్లకిలో మంగలాoబికా దేవి గా ఆసీనురాలైన ఎల్లమ్మ మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు , భక్తుల కోలాహలం మధ్య కలికిరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్మార్గాన్ని అణచివేసి విజయాన్ని సాధించి పెట్టిన గ్రామ దేవత ఎల్లమ్మ తన అక్క అంకాలమ్మ , తమ్ముడు ఆది పోతరాజు తో కలిసి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పిం చి మొక్కులు తీర్చుకున్నారు.


Body:పుష్ప పల్లకి పై ఎల్లమ్మ అమ్మవారు


Conclusion:చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ దేవత ఎల్లమ్మ వారు సోమవారం రాత్రి పుష్ప పల్లకి పై మంగలాoబికా దేవి గా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.