రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. నివర్ తుపాను ప్రభావంతో నకరికల్లు మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. 30 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్పడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: