ETV Bharat / state

కరోనాను రాజకీయంగా వాడుకుంటారా?: ఎమ్మెల్సీ రామకృష్ణ

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యలో ప్రజలకు అండగా నిలిచి...ధైర్యం చెప్పాల్సిన వైకాపా నేతలు...ఈ సమయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ మండిపడ్డారు .తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్​కు అందజేశారు.

author img

By

Published : Apr 3, 2020, 7:39 PM IST

tdp-gv-anjayaelulu
'కరోనాను సైతం రాజకీయంగా వాడుకుంటారా?'
'కరోనాను సైతం రాజకీయంగా వాడుకుంటారా?'

లాక్ డౌన్ నేపధ్యంలో పేదలకు సాయం చేస్తున్నామని వైకాపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ...సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కును అయన కలెక్టర్ కు అందజేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీ నెపంతో ఎన్నికల ప్రచారం చేయడం సరికాదన్నారు. వైకాపా నేతలు వార్డు వాలంటీర్లలతో కలసి ఫించన్లు పంపిణి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి లో ఓ మహిళకు 2250 రూపాయల ఫించన్ రావాల్సి ఉంటే.. వార్డ్ వాలంటీర్లు 1000 మినహాయించి ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే ఆ వాలంటీర్ల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు.

'కరోనాను సైతం రాజకీయంగా వాడుకుంటారా?'

లాక్ డౌన్ నేపధ్యంలో పేదలకు సాయం చేస్తున్నామని వైకాపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ...సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కును అయన కలెక్టర్ కు అందజేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీ నెపంతో ఎన్నికల ప్రచారం చేయడం సరికాదన్నారు. వైకాపా నేతలు వార్డు వాలంటీర్లలతో కలసి ఫించన్లు పంపిణి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి లో ఓ మహిళకు 2250 రూపాయల ఫించన్ రావాల్సి ఉంటే.. వార్డ్ వాలంటీర్లు 1000 మినహాయించి ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే ఆ వాలంటీర్ల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు.

ఇవీ చూడండి:

తీరాల్లో మత్స్యకారులు.. స్వస్థలాలకు చేర్చాలని వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.