ETV Bharat / state

గుంటూరులో బీసీ సంక్షేమ సంఘాల నేతల నిరసన ప్రదర్శన - protests in guntur news

గుంటూరులో బీసీ సంక్షేమ సంఘాల నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా ఆందోళన చేపట్టారు. రేపు నిర్వహించనున్న భారత్​ బంద్​ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

protest
బీసీ సంఘాల నేతల నిరసన ప్రదర్శన
author img

By

Published : Dec 7, 2020, 6:58 PM IST

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ గుంటూరులో బీసీ సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్​ చేశారు. రైతు హక్కులను కాలరాసేలా సర్కారు కొత్త చట్టాలను రూపొందించిందన్నారు.

జిల్లాలోని లాడ్జి సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంకుశ విధానాలను అవలంబిస్తుందన్నారు. రైతుల హక్కుల కోసం తలపెట్టనున్న భారత్ బంద్​లో స్వచ్ఛదంగా పాల్గొని జయప్రదం చేయాలని యువజన విభాగం రాష్టాధ్యక్షుడు క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు.

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ గుంటూరులో బీసీ సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్​ చేశారు. రైతు హక్కులను కాలరాసేలా సర్కారు కొత్త చట్టాలను రూపొందించిందన్నారు.

జిల్లాలోని లాడ్జి సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంకుశ విధానాలను అవలంబిస్తుందన్నారు. రైతుల హక్కుల కోసం తలపెట్టనున్న భారత్ బంద్​లో స్వచ్ఛదంగా పాల్గొని జయప్రదం చేయాలని యువజన విభాగం రాష్టాధ్యక్షుడు క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: తుళ్లూరులో రోడ్డుపై ఆందోళన విరమించిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.