పింఛన్ల చెల్లింపులో ఈరోజు నుంచి రాష్ట్రంలో సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా లబ్ధిదారులకు ఇంటివద్దనే పింఛన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కొన్నిచోట్ల పింఛన్ పంపిణీ మందకొడిగా సాగుతోంది. పట్టణంలోని కొన్ని వార్డులలో వాలంటీర్లు ఒకేచోట కూర్చొని వృద్ధులకు నగదు ఇస్తున్నారు. పింఛన్ కోసం వచ్చిన కొందరు వృద్ధులను... వార్డులో పేరు లేదని వెనక్కి పంపిస్తున్నారు. ఈ విషయమై కొంతమంది వాలంటీర్లను వివరణ కోరగా.... తమకు ఇచ్చిన లిస్టులో ఉన్న పేర్లు వారికి మాత్రమే నగదు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: పింఛన్ల పంపిణీలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ