అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండటం వల్ల రైతాంగం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పాలన కొనసాగించడం శుభసూచకం అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రకృతి సహకరించి పుష్కలంగా వర్షాలు పడి.. పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు.
ఇదీ చదవండి :