ETV Bharat / state

మీ సేవ కేంద్రంలో హత్య... అసలేం జరిగింది?

author img

By

Published : Jun 20, 2020, 12:32 PM IST

Updated : Jun 20, 2020, 1:21 PM IST

పొలం తగాదాల విషయంలో ఓ వ్యక్తిని దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆదిగొప్పులలో జరిగింది.

one person murder in adhigoppula due to land dispute
ఆదిగొప్పులలో ఓ వ్యక్తి దారుణ హత్య

గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆదిగొప్పులలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పొలం తగాదాల విషయంలో మీసేవా కేంద్రం నిర్వాహకుడు ఘంటా శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. శ్రీనివాసులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో..వెనకనుంచి వచ్చిన దుండగులు గొడ్డలితో నరికారు.

ఈ ఘటనలో శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ హత్యకు తోటవాసు అతని కుటుంబమే కారణమని మృతుని భార్య ఆరోపించారు. ఘటనా స్థలిలో ఆమె కన్నీరుమున్నీరైంది. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి ..దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆదిగొప్పులలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పొలం తగాదాల విషయంలో మీసేవా కేంద్రం నిర్వాహకుడు ఘంటా శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. శ్రీనివాసులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో..వెనకనుంచి వచ్చిన దుండగులు గొడ్డలితో నరికారు.

ఈ ఘటనలో శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ హత్యకు తోటవాసు అతని కుటుంబమే కారణమని మృతుని భార్య ఆరోపించారు. ఘటనా స్థలిలో ఆమె కన్నీరుమున్నీరైంది. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి ..దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. బంగారం దుకాణంలోనే సైనైడ్ మింగి కార్మికుడి ఆత్మహత్య

Last Updated : Jun 20, 2020, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.