ETV Bharat / state

'తెదేపా శ్రేణులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టండి'

author img

By

Published : Jun 24, 2020, 10:13 PM IST

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా శ్రేణులపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గుంటూరు గ్రామీణ ఎస్పీకి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండీ హిదాయిత్ లేఖ రాశారు. దాడులకు పాల్పడిన వైకాపా శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు.

గుంటూరు గ్రామీణ ఎస్పీకి ముస్లిం మైనారిటీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ లేఖ
గుంటూరు గ్రామీణ ఎస్పీకి ముస్లిం మైనారిటీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ లేఖ

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో తెదేపా నాయకుడు షేక్‌ గౌస్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నికి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండీ హిదాయిత్ లేఖ రాశారు.

మాచవరం ఎస్ఐ కేసులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలీసులే స్వయంగా తెదేపా వారిని గ్రామం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు. మాచవరం ఎస్ఐ వైకాపా కార్యకర్తలా పని చేస్తున్నారని... ఎస్ఐతో పాటు, దాడులకు పాల్పడిన వైకాపా శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.

ఇదీ చూడండి: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: తెదేపా నేతపై దాడి

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో తెదేపా నాయకుడు షేక్‌ గౌస్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నికి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండీ హిదాయిత్ లేఖ రాశారు.

మాచవరం ఎస్ఐ కేసులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలీసులే స్వయంగా తెదేపా వారిని గ్రామం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు. మాచవరం ఎస్ఐ వైకాపా కార్యకర్తలా పని చేస్తున్నారని... ఎస్ఐతో పాటు, దాడులకు పాల్పడిన వైకాపా శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.

ఇదీ చూడండి: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: తెదేపా నేతపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.