గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ తనపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ...శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ పారిశుద్ధ్య కార్మికురాలు విధులకు హాజరుకాకుండా ఆమె స్థానంలో మరో యువకుడిని విధులకు పంపిస్తుందని అదేమిటని ప్రశ్నిస్తే...యువకుడి బంధువైన జూనియర్ అసిస్టెంట్ రాజ్కుమార్ తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై పురపాలక కమిషనర్ భానుప్రకాశ్ను వివరణ కోరగా...దాడి ఘటనకు సంబంధించి సంజాయిషీ ఇవ్వాలని ఇద్దరు ఉద్యోగులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి